మోదీకి, సోనియా ఐదు కీలక సలహాలు: సోనియా


న్యూఢిల్లీ: ప్రచారాల కోసం ప్రభుత్వం ఇచ్చే ప్రకటనలను వెంటనే నిలిపివేసి ఆ డబ్బుల్ని ప్రధానమంత్రి సహాయ నిధి(పీఎం రిలీఫ్ ఫండ్‌)కి మళ్లించాలని కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సూచించారు. మంగళవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రాసిన లేఖలో ఆమె ఈ విషయం పేర్కొన్నారు. దానితో పాటు 20 వేల కోట్ల రూపాయల సెంట్రల్ విస్టా బ్యూటిఫికేషన్‌తో పాటు తదితర ప్రాజెక్టుల పనులను నిలిపివేసి ఆ నిధుల్ని కూడా పీఎం రిలీఫ్ ఫండ్‌కు మళ్లించాలని సోనియా విజ్ఞప్తి చేశారు
కరోనా వైరస్(కోవిడ్-19) వ్యాప్తిని అడ్డుకునేందుకు ఆదివారం సోనియాగాంధీకి ప్రధానమంత్రి ఫోన్ చేశారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రభుత్వానికి మద్దతుగా ఉండాలని సోనియాను కోరారు. దానితో పాటు కరోనాను ఎదుర్కోవడానికి సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వానికి సోనియా గాంధీ పలు సూచనలు చేశారు.
ప్రధానమంత్రికి రాసిన లేఖలో సోనియా గాంధీ ప్రధానంగా ఐదు విషయాలు సూచించారు. మీడియాకు ఇచ్చే అన్ని రకాల ప్రకటనలను రెండేళ్ల పాటు నిలిపి వేయమని సలహా ఇచ్చారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌ను సస్పెండ్ చేయమని కోరారు. బడ్జెట్ వ్యయంలో 30 శాతం కోత విధించమని సలహా ఇచ్చారు. అన్ని రకాల విదేశీ యాత్రలను రద్దు చేసుకోమని చెప్పారు. పీఎం కేర్స్‌కు వచ్చిన నిధులని పీఎం రిలీఫ్ ఫండ్‌కు మళ్లించమని ప్రధానమంత్రికి సోనియా సూచించారు.

About The Author