లాక్‌డౌన్ మధ్య మాజీ సీఎం కుమారుడి వివాహానికి ఏర్పాట్లు…


బెంగళూరు (కర్ణాటక): కరోనా లాక్‌డౌన్ అమలులోనూ కర్ణాటక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు, సినీహీరో నిఖిల్, కాంగ్రెస్ నాయకుడు క్రిష్ణప్ప మనవరాలు రేవతిల వివాహం జరపాలని నిర్ణయించారు. బెంగళూరు నగరంలోని వధువు ఇంటితోపాటు రాంనగర్ ఫాం హౌస్‌లలో ఈ నెల 17వతేదీన వివాహం జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా లాక్ డౌన్ అమలులో ఉన్నందున తన కుమారుడి వివాహం నిరాడంబరంగా కేవలం కుటుంబ సభ్యుల మధ్యే చేస్తామని కుమారస్వామి చెప్పారు. ఈ వివాహానికి బయటి వ్యక్తులను ఆహ్వానించమని ఆయన స్పష్టం చేశారు. కర్ణాటక రాష్ట్రంలో రాజకీయ నాయకుల ఇళ్లలో పెళ్లిళ్లు చాలా ఆడంబరంగా జరుగుతుంటాయి. కాని లాక్ డౌన్ వల్ల ఈ వివాహానికి ఎవరూ రావద్దని, సాధారణ స్థితులు నెలకొన్నాక రిసెప్షన్ ఆడంబరంగా నిర్వహిస్తామని కుమారస్వామి చెప్పారు.

About The Author