హోంగార్డు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన మంత్రి శ్రీ కేటీఆర్ రూ. 5 లక్షల ఆర్థిక సహాయం


సిరిసిల్లలో లాక్‌డౌన్‌ విధులు నిర్వహిస్తూ తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లికి చెందిన సిలువేరి దేవయ్య (50) అనే హోంగార్డుహఠాన్మరణం పొందగా మంత్రి కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభుతి తెలియజేశారు. వ్యక్తిగతంగా 5 లక్షల ఆర్థికసహాయం అందజేయనున్నట్లు ప్రకటించారు. కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. కాగా దేవయ్యకు భార్య భారతి, కూతురు నవ్య, కొడుకు సాయిప్రకాష్ ఉన్నారు.

About The Author