సాహస ఏఎస్సై హర్జీత్ సింగ్ కు ఎస్సైగా ప్రమోషన్


పంజాబ్ పాటియాల పోలీసుస్టేషన్ పరిధిలోని కూరగాయల మండి వద్ద లాక్ డౌన్ ను అతిక్రమించి గుమికూడిన పౌరులను చెదరగొట్టేందుకు వెళ్లిన ASI హర్జీత్ సింగ్ పై దుండగులు కత్తులతో దాడి చేశారు. దాడిలో ఆయన ఎడమ చేయి మణికట్టు వరకు తెగి కింద పడింది. రక్తం పోతున్నా భీతిల్లని ఏఎస్ ఐ వాళ్లందరిని తరిమేసిన తర్వాతే తెగిన చేతిని తీసుకుని హాస్పిటల్ కు వెళ్లాడు. ఏడున్నర గంటల పాటు శ్రమించిన పాటియాల ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్లు చేతిని మైక్రో సర్జరీతో తిరిగి అతికించారు. దీన్నంతా సిఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ స్వయంగా పర్యవేక్షించారు. మూడు రోజుల క్రితం ఈ ఘటన జగరగా హర్జీత్ సింగ్ కనబర్చిన సాహసానికి మెచ్చి సబ్ ఇన్ స్పెక్టర్ గా ప్రమోట్ చేస్తూ ఆదేశాలిచ్చారు.( ఫోటోలో తెగిపగిన చేతిని తీసుకుంటున్న ఎఎస్సై హర్జీత్ సింగ్)

About The Author