మోపిదేవి మండలం మోపిదేవి లంక గ్రామంలో మృతదేహం కలకలం….


విజయవాడ లో అనారోగ్యంతో చనిపోయిన వ్యక్తిని అర్ధరాత్రి ప్రవేటు అంబులెన్స్ లో తీసుకుని వచ్చి రోడ్డుపై వదిలేసిన కథనం…

మృతదేహం పక్కనే కూర్చుని ఏడుస్తున్న మృతుని భార్య, కుమారుడు..

మృతదేహాన్ని గ్రామంలోకి తీసుకుని రావడంతో భయబ్రాంతులకు గురవుతున్న గ్రామ ప్రజలు…

వివరాలలోకి వెళ్తే..
మోపిదేవి మండలం మోపిదేవిలంక గ్రామానికి చెందిన కారుమూరి చైనా వెంకటేశ్వరరావు వృత్తిరీత్యా పెదపులిపాక లో భార్య, కుమారుడితో నివాసం ఉంటున్నారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో విజయవాడ ఆసుపత్రిలో మందులు వాడుతూ మంగళవారం రాత్రి మృతి చెందగా, ప్రవేటు అంబులెన్సులో మృతదేహాన్ని తీసుకుని తెల్లవారుజామున 3 గంటల సమయంలో మోపిదేవి లంక గ్రామానికి వచ్చి, రోడ్డుపై దింపారు. ఇదే గ్రామంలో నివాసం ఉంటున్న మృతుని సోదరుడు మృతదేహాన్ని తన ఇంటికి తీసుకుని వెళ్ళడానికి నిరాకరించారు. ఎక్కడో అనారోగ్యంతో మృతి చెందిన వ్యక్తిని అర్ధరాత్రి మా గ్రామానికి ఎందుకు తీసుకుని వచ్చారు అని గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు.

మృతుని బంధువులకు నచ్చచెప్పి మృతదేహాన్ని ఇక్కడే ఖననం చేయాలా లేక విజయవాడ కు మృతదేహాన్ని తిరిగి పంపించాలా అని పోలీసులు తల పట్టుకుని కూర్చున్నారు.

About The Author