కార్మికులకు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య 3వేల మందికి నిత్యావసర సరుకులు..


కరోన నిర్మూలన కోసం ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వివిధ రంగాల కార్మికులకు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పలువురి దాతల సహకారంతో దాదాపు 3వేల మందికి పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదివారం పంపిణీ చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం లోని కల్లూరులో చేతి వృత్తులపై ఆధారపడి పనిచేసుకునే దాదాపు 19 రకాల వారు కార్పెంటర్స్, ఎలెక్ట్రిషియన్స్, గుడి అయ్యగార్లు, పేయింటర్స్, నాయి బ్రాహ్మణులు, మజీద్ మౌలానా లు, ఇస్త్రీ చేసుకున్నే వారు, చెప్పులు కుట్టే వారు, ఆశా వర్కర్లు, గ్రామ పంచాయతీ వర్కర్లు, ఫోటోగ్రాఫర్స్, చర్చ్ పాస్టర్స్, టైలరింగ్ వర్కర్స్, పూలు అమ్ముకునే వారు తదితర కార్మికులకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికులను పూలతో మంత్రి పువ్వాడ సత్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ , అదనపు కలెక్టర్ మధుసూదన్ రావు నాయకులు ఉన్నారు.

About The Author