ధూల్ పేట‌లో నిశ్చితార్ధం…15 మందికి కరోనా పాజిటివ్..


హైద‌రాబాద్ – గ్రేట‌ర్ ధూల్ పేట‌లో ఇటీవ‌ల జ‌రిగిన నిశ్చితార్థం 15 మందికి క‌రోనా సోకేలా చేసింది.. వివ‌రాల‌లోకి వెళితే హైదరాబాద్ నగరంలోని జుమ్మేరాత్‌బజార్ జుంగూర్ బస్తీలో నివసిస్తున్న ఓ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ (38) తండ్రి శ‌నివారం నాడు మ‌ర‌ణించారు. దీంతో అధికారుల‌కు అనుమానం వ‌చ్చి ఆరా తీస్తే క‌రోనా మ‌ర‌ణం అని తేలింది.. దీంతో మేనేజ‌ర్ తో స‌హా అత‌డి కుటుంబ స‌భ్యులు 30 మందిని కారంటైన్ కి త‌ర‌లించి ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.. వారిలో 15 మందికి క‌రోనా తేలింది. కాగా దూల్ పేట్ లో జ‌రిగిన పెళ్లి నిశ్చితార్థం జరిపిన పెళ్లికొడుకు కుటుంబంలో వారు స‌భ్యుల‌ని తేలింది.. ఈ కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి కరోనాతో శనివారం నాడు మరణించడంతో ఈ కేసులన్నీ వెలుగులోకి వచ్చాయి. ఈ నిశ్చితార్థం మే 11న హైదరాబాదులోని ధూల్ పేట్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి లాక్ డౌన్ నిబంధనలు, భౌతికదూరం సూచనలు పక్కనబెట్టి పెద్ద సంఖ్యలో అతిథులు హాజరైనట్టు సమాచారం. ఇప్పుడు వారందరి వివరాలు సేకరించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఇదిలా ఉంటే శివ్‌లాల్ నగర్‌లో నివసిస్తున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగికి పాజిటివ్ అని తేలింది. దాంతో కుటుంబంలోని 21 మందికి పరీక్షలు చేశారు. అందులో ఇద్దరికి పాజిటివ్ అని రిపోర్ట్ రావడంతో చికిత్స తీసుకుంటున్నారు. మిగిలిన వారందరినీ క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.

About The Author