పటమట గ్యాంగ్ వార్ లో కొత్త విషయాలు…..


మృతుడి సందీప్ భార్య, రాష్ట్ర మంత్రి ఒకరికి సమీప బంధువు….

లాక్ డౌన్ ముందు ఓ ఆటోని ఢీ కొట్టి డ్రైవర్ మరణానికి కారణమైన సందీప్

రాజకీయ పలుకుబడితో తప్పించుకున్న వైనం, 6లక్షలతో కేసు రాజీ చేసినట్టు చెబుతున్న స్థానికులు

శనివారం గ్యాంగ్ వార్ సమయంలో 25మంది అనుచరులతో వెళ్లిన సందీప్….

తన అనుచరులను స్పాట్ లో మొబైల్ ఫోన్ లో వీడియో లు తీయమని చెప్పిన సందీప్

పక్కా ప్లానింగ్ తో వచ్చిన మణికంఠ రౌడి షీటర్లు, బ్లేడ్ బ్యాచ్ వారితో కలిసి దాడి….

మణికంఠ తరపున వచ్చిన వాళ్లంతా డ్రగ్ అడిక్ట్ లు, బ్లేడ్ బ్యాచ్ సభ్యులుగా అనుమానం…

తన హీరోయిజం చూపుకుందామని వచ్చి బలైపోయిన సందీప్….

మణికంఠ బామ్మర్ది నేరుగా బీర్ బాటిల్ పగులగొట్టి, కత్తితో పొడిచినట్టు ప్రత్యక్ష సాక్షుల సమాచారం….

29వ తేదీన శివ బాలాజీ స్టీల్స్ సిబ్బందిపై దాడి తర్వాత మణికంఠ ఇంటి వద్ద కొనసాగిన వివాదం…

మణికంఠ కుటుంబ సభ్యులతో సందీప్ వర్గం బాహాబహికి దిగినా పోలీసులకు అందని సమాచారం

వివాదం తమ పరిధి కాదని తప్పుకున్న పటమట, పెనమలూరు పోలీసులు

రెండో రోజు కొనసాగిన గొడవలో సందీప్ కి కత్తిపోట్లు., మృతి

మొదట దేవినేని అవినాష్, ఆ తర్వాత చందూ వర్గంలో కొనసాగిన సందీప్….

పటమటలో నిర్వహిస్తున్న స్టీల్ దుకాణం ఓ పార్టీ యువ నాయకుడి నుంచి లీజ్ తీసుకున్నట్టు చెబుతున్న బంధువులు….

About The Author