అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం లో తండ్రి కుమారుడు మృతి

 

చిత్తూర్ జిల్లా ,ఐరాల మండల పోలీస్ స్టేషన్ పరిధి లోని కర్నూల్-చిత్తూర్ జాతీయ రహదారి లో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది.ఎస్ ఐ శ్రీకాంత్ రెడ్డి కథనం మేరకు కల్లూరు కు చెందిన ఖాదర్ భాష (38),కుమారుడు తబ్రోజ్(14) తో కలిసి ఐరాల లో జరిగిన ఒక  కార్యక్రమంలో పాల్గొన్నారు.

అనంతరం అదే రోజు రాత్రి ద్విచక్రవాహనంపై కల్లూరు కు  బయలు దేరారు. అయితే గుండ్లపల్లి సమీపంలోని అక్కం చెరువు వద్దకు రాగానే వాహనాన్ని తప్పించుకు నే ప్రయత్నం లో ఎదురు గా వస్తున్న వాహనం వేగంగా ఢీ కొట్టింది.దీనితో తండ్రి, కొడుకు అక్కడికక్కడే మృతిచెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు దీంతో అతడిని 108 ద్వారా స్థానికులు చిత్తూరు ఆసుపత్రికి తరలించారు.

About The Author