భూ కబ్జాదారులు చేతుల్లో ప్రభుత్వ భూమి….?


ఎర్రావారిపాలెం మండలం ఎల్లమంద పంచాయతీ ఎల్లమంద రెవెన్యూ పరిధిలోని కొత్తసాయిబులపల్లి వద్ద వున్న ప్రభుత్వ భూమిని సుమతి అనే ఆమె ప్రభుత్వ భూమి రెండు ఎకరాలు కబ్జా చేసింది .ఈ విషయమై సుమారు 6 నెలల క్రితం మండల తాసిల్దార్ కు ఫిర్యాదు చేసిన ఏమాత్రం పట్టించుకోని పరిస్థితి వీఆర్ఏ ద్వారా తాత్కాలికంగా పనిని ఆపినా ఈ రోజు మరలా జెసిబి లు పెట్టి భూమి చుట్టూ కందకం, పెన్సింగ్ వేయడానికి సిద్ధం చేస్తున్నారు .ఈ విషయమై కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం డప్పు కళాకారుల సంఘం సంయుక్తంగా వెళ్లి అక్కడ జరుగుతున్నటువంటి పనులను పరిశీలించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడమైనది. ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మారెళ్ళ శ్రీనివాసులు మాట్లాడుతూ ఎల్లమంద పంచాయతీ పరిధిలోని మర్రిమా కుల పల్లి ,ముక్కరవాండ్లపల్లి, గుట్ట కింద పల్లి, గుట్ట కింద హరిజనవాడ, ఈడిగపల్లి తదితర గ్రామాల్లో ఇళ్లు లేని వారు, ఇంటి జాగాలు లేని వారికి ఇంటి స్థలాలు ఇవ్వకుండా పులిచెర్ల మండలం కల్లూరుకు చెందిన అగ్ర కులాల వారు వచ్చి భూమిని ఆక్రమించుకుంటూ ఉంటే భూమికి కూతవేటు దూరంలో ఉన్న వీఆర్ఏ రామచంద్రయ్య కూడా పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారు. ఈ విషయమై జిల్లా రెవెన్యూ అధికారి గారికి, అలాగే మదనపల్లి సబ్ కలెక్టర్ గారికి, ఫిర్యాదు చేయడమైనది. వెంటనే ఉన్నత అధికారులు జోక్యం చేసుకుని అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ భూమిని కాపాడి ఇంటి స్థలం లేని వారికి ఇచ్చి ఆదుకోవాలని మారేళ్ళ శ్రీనివాసులు డిమాండ్ చేయడమైనది .అలా చేయని పక్షంలో మండల స్థాయిలో ఉద్యమాలు చేసి ప్రజలందరికీ ప్రభుత్వ భూమిని పంచాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డప్పుకళాకారుల సంఘం మండల కార్యదర్శి దనాసి వెంకటరమణ, కెవిపిఎస్ మండల కార్యదర్శి

About The Author