రైతులకు అండగా ఈ నెల 8న తలపెట్టిన భారత్‌ బంద్‌కు సంపూర్ణ మద్దతు.


– తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి శ్రీ కేటీఆర్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రులు శ్రీ మహమూద్ అలీ, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ శ్రీ కేశవరావు, ఎమ్మెల్యేలు శ్రీ బాల్క సుమన్, ఎమ్మెల్సీ శ్రీ శ్రీనివాస్ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితర నాయకులు
ఈ సందర్భంగా శ్రీ కేటీఆర్ మాట్లాడుతూ..
– కేంద్ర ప్రభుత్వం నూతనంగా తెచ్చిన వ్యవసాయ చట్టాలు.. అవి నల్లచట్టాలు
– పార్లమెంట్ వేదికగా కేంద్ర వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించాం
– రాజ్యసభలో కేంద్రం మందబలంతో బిల్లులను ఆమోదింపజేసుకుంది
– ఎముకలు కొరికే చలిలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు కేంద్రంతో పోరాడుతున్నారు
– పోరాటం చేస్తున్న రైతులకు టీఆర్ఎస్ పార్టీ సెల్యూట్ చేస్తుంది
– వారికి సంఘీభావంగా టీఆర్ఎస్ శ్రేణులు ఎల్లుండి బంద్ లో భాగస్వాములు కావాలి
– రైతుబంధు సమితి సభ్యులు రైతులను కదిలించాలి
– వ్యాపార, వాణిజ్యవేత్తలకు మా విన్నపం.. రైతులకు సంఘీభావంగా 2 గంటలు బంద్ చేయండి
– కేంద్ర చట్టాలతో రైతు ఎలా ఇబ్బంది పడుతున్నాడో.. కార్పోరేట్లకు వ్యవసాయం ధారాదత్తం చేసే కుట్రలను వివరించండి
– మోటారు వాహనాల యజమానులు బంద్ కు సహకరించాలి
– టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు జాతీయ రహదారులపై మోహరించి ధర్నా, రాస్తారోకోలతో మద్దతు తెలపాలి
– ఈ నల్లచట్టాలు పోయేదాకా రైతులకు టీఆర్ఎస్ అండగా నిలుస్తుంది
– కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా రైతులకు మద్దతుగా నిలుద్దాం
తెలంగాణ భవన్ మీడియా సమావేశంలో మంత్రి శ్రీ నిరంజన్ రెడ్డి గారు
– భారత రైతాంగం తలపెట్టిన భారత్ బంద్ కు టీఆర్ఎస్ మద్దతు పలుకుతుంది
– మమ్మల్ని ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసినందుకు సీఎం కేసీఆర్ గారికి ధన్యవాదాలు
– ఈ దేశ రైతాంగానికి దారి చూపే శక్తి తెలంగాణ నుండి కేసీఆర్ గారి రూపంలో ఉంటుందని భావిస్తున్నాం
– రైతాంగాన్ని ఆత్మ విశ్వాసంతో నిలిపింది కేసీఆర్ గారి ప్రభుత్వమే
– వ్యవసాయరంగం మీద దాదాపు రూ.60 వేల కోట్లు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
– దీనిమూలంగానే తెలంగాణ స్థిరపడినం, బలపడినం
– కేంద్ర నిర్ణయాలు దేశానికి ఉపయోగపడతాయి అనుకుంటే వ్యవసాయ చట్టాలు రైతుపై పిడుగులా పడ్డాయి
– వ్యవసాయ చట్టాలలో ఏ మాత్రం రైతు కోణం లేదు
– దేశంలో వివిధ సంస్థలు అమ్మిన కేంద్రం .. ఇప్పుడు కీలకమైన ఆహారరంగం మీద దృష్టిపెట్టింది.. దీనిని కార్పోరేట్ కు అప్పజెప్పే ప్రయత్నం చేస్తుంది
– ధాన్యానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా అదనపు ధర ఇస్తే కొనుగోళ్లు ఆపేస్తామని కేంద్రం బ్లాక్ మెయిల్ చేస్తున్నది
– రాష్ట్రం అదనపు ధర ఇస్తే అభినందించాల్సింది పోయి అడ్డుకుంటుంది
– తెలంగాణ పత్తి దేశంలో నంబర్ వన్ అని, అక్కడ పండిన పంట అంతా కొంటాం అని సీసీఐ తెలిపింది
– ఇప్పుడు కొనుగోలు కేంద్రాల వద్దకు రైతులే రావాలి, వారి రక్తసంబంధీకులే రావాలి అని నిబంధన పెట్టారు
– ఇది రైతులను ఇబ్బంది పెట్టడమే
– కోటీ 3 లక్షల ఎకరాలలో గత వానాకాలం, యాసంగిలో వరి పండింది
– ప్రాజెక్టులన్నీ పూర్తయితే ప్రతి సీజన్ కు కోటి ఎకరాలలో వరి సాగయ్యే అవకాశం ఉంది
– పెరుగుతున్న వ్యవసాయ దిగుబడులను ప్రోత్సహించాల్సిన కేంద్రం కార్పోరేట్లకు లాభం చేకూర్చే నిర్ణయాలు తీసుకుంటుంది
– కేంద్రంతో పోరాడుతున్న రైతాంగానికి టీఆర్ఎస్ , తెలంగాణ యావన్మంది రైతాంగం మద్దతు తెలుపుతున్నాయి
– ఎల్లుండి ప్రతి గ్రామంలో రైతులు కేంద్ర వ్యవసాయ చట్టాలపై చర్చ చేయాలి

About The Author