ఉరేసుకుని తల్లీ బిడ్డ ఆత్మహత్య…


కడప నగరంలోని శంకరాపురంలో నివాసం ఉంటున్న తల్లీ, బిడ్డ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. కడపకు చెందిన శ్రావణి(29)కి శివకుమార్‌ రెడ్డితో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఎనిమిదేళ్ల కుమార్తె తన్విక ఉంది. శివకుమార్‌ రెడ్డి ప్రస్తుతం అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు.

శ్రావణి… కుమార్తె తన్విక(8)తో కలిసి శంకరాపురంలోనే నివాసం ఉంటోంది. అయితే, గత ఐదేళ్లుగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో గురువారం ఉదయం శ్రావణి తన కుమార్తెతో కలిసి పడక గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న చిన్నచౌక్‌ పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ అశోక్‌ రెడ్డి తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలను ఆరాతీస్తున్నట్లు చెప్పారు.

About The Author