తిరుమల శ్రీవారి సేవలో ఎస్ ఈ సీ నిమ్మగడ్డ రమేష్ కుమార్


ఏ పీ ఎస్ ఈ సీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బిజీగా ఉన్న ఆయన ఇవాళ శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం చేయించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని ప్రార్థించానని నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీడియాకు తెలిపారు. ఎప్పుడూ వార్తల్లో ఉండే నిమ్మగడ్డ.. ఈసారి తిరుమల పుణ్యక్షేత్రంలో ప్రత్యక్షమై మీడియాను ఆశ్చర్యపరిచారు. ఇకపోతే పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వరుసగా పర్యటనలు చేస్తున్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. కడప, విశాఖపట్టణం, ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించారు. ఏకగ్రీవాలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చిన ఆయన బలవంతంగా ఏకగ్రీవాలు చేయొద్దని హితవు పలికిన సంగతి తెలిసిందే.

About The Author