పాటి గ్రామంలో యాదవ సంగం ఆధ్వర్యంలో అంగరంగ వైభావంగా మల్లన్న జాతర


పాటి గ్రామంలో యాదవ సంగం ఆధ్వర్యంలో అంగరంగ వైభావంగా మల్లన్న జాతర భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు.

*పటాన్ చేరు మండల పరిధి లోని పాటి గ్రామములో సోమవారం రోజు యాదవ సంగం ఆధ్వర్యంలో ఎంపీటీసీ సునిత గోపాల్ యాదవ్ గారి చేతుల మీదుగా ఘనంగా మల్లన్న జాతర నిర్వహించారు,ఈ సందర్బంగ గోపాల్ యాదవ్ మాట్లాడుతు గుడి సభ్యులు, కుర్మ సంగం ప్రెసిడెంట్, ఆధర్వములో జాతరకు వచ్చే మల్లన్న భక్త్గులకు, తగిన వసతులు సౌకర్యాలు కల్పించామని తెలిపారు ,గత 18 సమత్సరాల నుండి ప్రతీ ఏట, ఘనంగా మల్లన్న జాతర నిర్వహిస్తున్నామని, ఈ సంవత్సరము కరోనా నేపధ్యములో, కరోనా నిబంధనలను పాటిస్తు జాతర నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు,
ఈ కార్యక్రమములో పాటి ఎంపీటీసీ సునిత గోపాల్ యాదవ్,సర్పంచ్ లక్ష్మణ్, ఉప సర్పంచ్ లావణ్య రజినీకాంత్, మాజీ ఎంపిటిసి మహేశ్వరి శ్రీనివాస్ యాదవ్, మాజీ సర్పంచ్ రాములు యాదవ్,కుర్మ సంగం ప్రెసిడెంట్, క్రిష్టయ్య, ఆలయ గుడి సభ్యులు శంకర్ యాదవ్, కృష్ణ యాదవ్, కొత్త కుమార్యాదవ్,,ఆలయ కమిటీ సభ్యులు తదితరులు ఫాల్గొన్నారు.

సంగారెడ్డి జిల్లా, పటాన్ చేరు నియోజక వర్గం.

About The Author