జంట హత్యల కేసును ఛేదించిన ఈస్ట్ పోలీసులు
తిరుపతి.2026,జూలై,10, వాసు దేవయ్య సునీల్, ఉపేంద్ర ప్రధాన నిందితులను అరెస్ట్ చేసాం.
ఏర్పేడు మండలం జంగాలపల్లి గ్రామానికి చెందిన సునీల్ అతడి భార్యతో విభేదాల వల్లే హత్యకు కారణం.
భార్యాభర్తల వివాదంలో పెద్దమనిషిగా వ్యవహరించిన మృతుడు మునిరత్నం, మణికంఠ.
పంచాయతీకి వచ్చిన మునిరత్నంపై ముందస్తు ప్రణాళికతో దాడి.
కత్తులతో దాడి చేయడంతో మునిరత్నం అక్కడే మృతి చెందాడు.
మణికంఠ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
భార్యాభర్తల మధ్య మనస్పర్థలే వివాదాలకు కారణం
పది నెలలుగా సునీల్ దూరంగా ఉంటున్న భార్య
ఇరు కుటుంబాల మధ్య కొంతకాలం నుండి గొడవలు కేసులు
ఇరువురు కుటుంబాల మధ్య గొడవల నేపథ్యంలో ఏర్పేడు పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 133/2023, 141 /2023.96/2025,94/2025 వరకట్నం వేధింపులు, గొడవల కేసులు.గొడవల కారణంగా గ్రామం విడిచిన దూరంగా ఉంటున్న సునీల్ కుటుంబం.ఈనెల 8 రాత్రి పద్మావతి కళ్యాణ మండపాల వద్ద జరిగిన గొడవలో హత్యకు దారి తీసింది.
నిందితులను అరెస్టుతో పాటు హత్యకు ఉపయోగించిన కత్తిని, ద్విచక్ర వాహనాన్ని, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నాం.
నిందితులను కోర్టు యందు ప్రవేశపెట్టి రిమాండ్ కు తరలిస్తున్నాం.తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఏఎస్పి రవి మనోహర చారి వెల్లడి.
