మిగిలిపోయిన బీఎస్సీ నర్సింగ్ సీట్లు.. ఇంటర్ మార్కుల ఆధారంగా భర్తీ
అమరావతి,07, ఆగస్టు ,రాష్ట్రంలో బీఎస్సీ నర్సింగ్ కోర్సులో కన్వీనర్, మేనేజ్మెంట్ కోటాలో కౌన్సెలింగ్ అనంతరం మిగిలిపోయిన ఖాళీ సీట్లను ఇంటర్ మార్కుల ఆధారంగా భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి చ్చింది. 2025-26లో అమలైన ఈ నిబంధనను 2026-27 విద్యా సంవత్సరానికి కూడా పొడిగిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ నర్సెస్, మిడ్వైవ్స్ కౌన్సిల్ రిజిస్ట్రార్ నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని వైద్య విద్య సంచాలకులు, ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ను ప్రభుత్వం ఆదేశించింది.
