సర్జికల్ స్ట్రైక్ – 2..! కసితీర పగ తీర్చుకున్న భారత్…

సర్జికల్ స్ట్రైక్ – 2..! కసితీర పగ తీర్చుకున్న భారత్..
పాకిస్థాన్ ఫై దాడులు ప్రారంభించిన భారత్.

ఈ రోజు ఉదయం మూడున్నర గంటల సమయంలొ, 12 మిరేజ్ యుద్ధ విమానాలతొ పెద్ద ఏత్తున దాడులు చేసిన భారత్. మొదటి విడతగా జరిపిన దాడులలొ

1000 కిలోల బాంబులతో పాకిస్తాన్‌లోని బాలాకోట్ పట్టణంలో ఉన్న JeM స్థావరాలను నేలమట్టం చేసిన భారత్..
LoC లొని అతి పెద్ద తీవ్రవాద స్థావరం పూర్తిస్థాయి ద్వంసం. 100% సక్సెస్ అయిన మొదటి విడత దాడులు ..
పుల్వామా దాడులకు భారత్ ప్రతీకారం తీర్చుకుంది. జైషే మహ్మద్ తీవ్రవాద శిబిరాలే టార్గెట్‌గా వైమానిక దళం దాడులు చేసింది .పీఓకేలోని బాల్‌కోట్ కేంద్రంగా ఉన్న జేషే మహ్మద్ ఉగ్రవాద శిబిరం ధ్వంసం అయినట్లు సమాచారం. మొత్తం 12 యుద్ధ విమానాలతో దాడులకు దిగింది భారత్. కార్గిల్ యుద్ధం తర్వాత వైమానిక దళం దాడులు చేయడం ఇదే తొలిసారి.

మోదీ ఆదేశాలతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పని పూర్తి చేసింది. మరోవైపు పీఓకేలోకి భారత్ యుద్ధ విమానాలు వచ్చినట్లు పాకిస్థాన్ కూడా ప్రకటించింది. ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళం విరుచుకుపడంది. సరిహద్దు నియంత్రణ రేఖ (LOC) వెంబడి ఉన్న ఉగ్రవాద శిబిరాలపై వెయ్యికిలోల బాంబుల్ని వదిలింది. తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఉగ్రవాద శిబిరాలపై మెరుపుదాడులు చేసింది. 12 మిరేజ్ 2000 జెట్ ఫైటర్స్‌తో దాడి చేసింది. భారత్ చేసిన ఈ భీకర ఎటాక్‌లో ఉగ్రవాద శిబిరాలన్నీ నేలమట్టం అయ్యాయి.

About The Author