భాదాకరమైన విషయం మన ఎయిర్ ఫోర్సు అధికారి పాకిస్తాన్ గుప్పెట్లో ..


భాదాకరమైన విషయం మన ఎయిర్ ఫోర్సు అధికారి పాకిస్తాన్ గుప్పెట్లో ..

భారత పైలట్ ఒకరు తప్పిపోయినట్లు భారత ప్రభుత్వం ధృవీకరించింది. భారత్ కు చెందిన మిగ్ యుద్ధ విమానం పాకిస్థాన్ లోకూలిపోయిందని.. ఒక భారత పైలట్ మిస్సింగ్ అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు.

పాకిస్తాన్ గుప్పెట్లు చిక్కుకున్న అధికారి పేరు అభినంధాన్ వర్తమాన్ సర్వీస్ నెంబర్ 27981, అలాగే పాక్ యుద్ధ విమానాన్ని భారత దళాలు కూల్చివేశాయని కూడా తెలిపారు. అలాగే భారత్ మిగ్-21 విమానాన్ని కోల్పోయామని తెలిపారు. మన పైలెట్ తమ అదుపులో ఉన్నట్టు పాకిస్తాన్ చెప్పింది. దీంతో ఆ పైలెట్ ఏమయ్యారా అన్న ఆందోళన నెలకొంది. భారత పైలెట్ ఆచూకీని కనిపెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

About The Author