భారత ప్రభుత్వం పనితీరు నిజంగా అమోఘం…

భారత ప్రభుత్వం పనితీరు నిజంగా అమోఘం..
ఒక పక్క రెండు దేశాల సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తకంగా ఉన్నా,,
ఎవరు చేయాల్సిన పని వారు చేసుకుంటూ వెళ్లిపోయారు తప్ప ఎవరి అనుమతుల కోసమో ఎదురు చూస్తున్నట్లు ఎక్కడా కనపడలేదు..
సుష్మ స్వరాజ్ గారు చేసిన విదేశాంగ విధానం, భద్రత సలహా దారు అజిత్ దోవల్ గారు తెర వెనుక నడిపిన దౌత్యం, రక్షణ శాఖ మంత్రి నిర్మల సీతారామన్ గారి ఆలోచన విధానం, హోమ్ మంత్రి రాజనాద్ సింగ్ గారి తీసుకున్న నిర్ణయాలు, వీరందరిని నడిపించిన ప్రధాని నరేంద్రమోడీ గారి నాయకత్వం..
అదే కాంగ్రెస్ ప్రభుత్వం లో ఈ మంత్రిత్వ శాఖ లు అన్నీ కూడా సోనియా మొహం వైపు చూస్తూ ఉండాలి ఆవిడ ఇచ్చే సైగల కోసం.. జాతీయ భావాలు కలిగిన వ్యక్తులు అందరూ కలిసి నడుపుతున్న ప్రభుత్వం యొక్క పనితీరు ఇలాగే ఉంటుంది.. పక్కనే ఉన్న పాకిస్థాన్ ని చూస్తే తెలుస్తుంది ఈ రెండు రోజుల్లో ఇమ్రాన్ ఖాన్ గంట కో వీడియో వదులుతూ హడావుడి చేస్తే ఈ విషయం పై ప్రధాని ఒక్కసారి కూడా మీడియా ముందుకు రాలేదు.. ఎవరి పని వారు చేసుకుంటూ వెళ్లారు.. అందుకే నిబద్దతతో కూడిన ప్రభుత్వాలు నడిపే నాయకుల వద్ద “నేను” అనే మాటకు స్థానం ఉండదు, ఏమి చేసిన “మేము” అనే పదానికే మాత్రమే స్థానం ఉంటుంది.. Jai hind

About The Author