ప్రపంచంలో ఎక్కడా లేనివి తెలంగాణలో వున్నవి…

⑴ సరస్వతి ఆలయాలు ఉన్నవి రెండే ప్రాంతాలలో..
కాశ్మీర్.. *బాసరా (తెలంగాణ)..*
⑵ బ్రహ్మదేవుడి ఆలయాలు ఉన్నవి రెండే ప్రాంతాలలో…
పుష్కర్ (రాజస్థాన్).. *ధర్మపురి (తెలంగాణ)..*
⑶ త్రివేణి సంగమాలు ఉన్నవి రెండే ప్రాంతాలలో..
అలహాబాద్ (ఉత్తర్ ప్రదేశ్).. *కాలేశ్వరం (తెలంగాణ)*
⑷ ఉత్తర వాహినిగా ప్రవహించే నదుల ప్రాంతం రెండే కలవు..
నర్మదా నది.. ఓంకారేశ్వర్ (మధ్యప్రదేశ్)
*గోదావరి నది.. చెన్నూర్ (తెలంగాణ)*

*ధర్మపురి:-*
యముడు శివునికై తపస్సు చేసింది ఇక్కడే..
(మార్కండేయుని విషయంలో చేసిన పాపం కారణంగా)
బ్రహ్మదేవుడు (సృష్టి)
నరసింహుడు, (స్థితి)
శివుడు, (లయం)
యముడు, (కాలం)
అరుదైన దైవ సంయోగ దేవాలయం ఇది

*కాళేశ్వరం:-*
ఒకే పానవట్టం పై రెండు శివలింగాల అపురూప ఆలయం ఇది..
గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల అమృత సంగమ క్షేత్రం ఇది..
సరస్వతి నది చివరి సారి దర్శనం ఇచ్చింది ఇక్కడే..

*వేములవాడ:-*
అహల్య విషయంలో పాపం చేసిన దేవేంద్రుడు (దేవరాజు) శాప పరిహారానికి శివుడికై తపస్సు చేసింది ఇక్కడే. ఇక్కడి శివుడి నామదేయం రాజరాజేశ్వరుడు (రాజులకే రాజు ఆయన)

*మెదక్:-*
సప్తరుషులు తపస్సు చేసింది ఇక్కడే, మంజీర నది ఏడు పాయలుగా విడిపోయిన అద్భుత దృశ్యం ఇక్కడ ఉంది..

*యాదగిరి:-*
అహోబిలం నుండి ఉగ్రరూపంతో వస్తున్న ఉగ్రనరసింహుడు శాంతించి లక్ష్మిదేవితో కలిసి వెలిసిన దేవాలయం..

*కొండగట్టు:-*
శ్రీరాముడు నడయాడిన ప్రాంతం గనక అమితానందంతో ఆంజనేయుడు సంజీవని పర్వతంలో ఓ భాగాన్ని వదిలిన ప్రాంతం..

*బాసర (వ్యాసపురి):-*
వేదవ్యాస మహర్షి సరస్వతి మాతకై తపస్సు చేసి మహాభాగవతం రచించిన ప్రాంతం..

*భద్రాచలం:-*
శ్రీరాముడు మహావిష్ణువు రూపంలో ఉన్న ఏకైక ఆలయం.

*చెన్నూర్:-*
గోదావరి నది ఉత్తర వాహినిగా ప్రవహించే ఏకైక ప్రాంతం.

*మంథని:-*
మంత్రనగరి అసలు పేరు, త్రేతాయుగంలో వైదిక మంత్ర తంత్ర సాధన, పరిశోదనకై అగస్త్య మహాముని ఏర్పటు చేసిన తొలి ఆశ్రమం ఇక్కడే.

*బోదన్:-*
బోధనపురి అసలు పేరు. మంతనిలో అభ్యసించి అర్హత సాదించిన గురువులు శిష్యులకు బోధించడానికి ఏర్పాటు చేసిన తొలి గురుకుల పాఠశాల ఇక్కడే.

*మన తెలంగాణ ఘన కీర్తి గల తెలుగు నేల* *మనదైనందుకు తెలుగు వారిగా గర్వ పడదాం*

About The Author