నాకు ఏం జరిగినా జగనే కారకుడు: ఆదినారాయణరెడ్డి…

నాకు ఏం జరిగినా జగనే కారకుడు: ఆదినారాయణరెడ్డి

తనకు ఏం జరిగినా వైసీపీ నేతలు జగన్‌, విజయసాయిరెడ్డి కారకులని మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. విజయసాయిరెడ్డి రాజకీయాలకు కొత్త అని, ఆయనది అడ్డదిడ్డమైన భాష అని ఆరోపించారు. వివేకానందరెడ్డికి గుండెపోటు అని మాజీ ఎంపీ అవినాష్‌రెడ్డి చెప్పారని అయితే ఆయనది హత్య అని కూతురు, అల్లుడు ఫిర్యాదు చేశారని చెప్పారు. అవినాష్‌రెడ్డి ఇల్లు పక్కనే ఉందని, విచారణ చేస్తే అంతా బయటపడుతుందన్నారు.

మీరు తప్పులు చేసి వేరేవారిపై నెట్టేస్తారా…? కోడికత్తి కేసప్పుడూ నాపై నింద వేశారు.

ఎలక్షన్లు తమకు అనుకూలంగా రావాలనే వారి కుట్ర చేశారు. తప్పు కప్పిపుచ్చుకునేందుకు దొంగాట ఆడుతున్నారు. ఎన్నో కేసుల్లో విజయసాయిరెడ్డి ముద్దాయి. అలాంటి వ్యక్తి మాటలకు విలువలేదు. ఆయనకు ధర్మం, న్యాయం లేదు. కోడికత్తి కేసుతో నాకు ఏంటి సంబంధం? నన్నుదెబ్బకొట్టేందుకు అనేక యత్నాలు చేస్తున్నారు. నన్ను అంతమొందించేందుకే ఇవన్నీ నాటకాలు ఆడుతున్నారు. గంగిరెడ్డి చూసి వెళ్లిన తర్వాత కూడా గుండెపోటే అన్నారు. మూడుగంటల తర్వాత హత్య అని ఎలా అంటారు? శవాన్ని పొడిచి హత్యగా చిత్రీకరిస్తున్నారా? ఎలాంటి విచారణకైనా నేను సిద్ధం అని ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు.

About The Author