చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన…

చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన
అమరావతి; – ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు.

మధ్యాహ్నం 12 గంటలకు మదనపల్లెలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారు.

మధ్యాహ్నం ఒంటి గంట 45 నిమిషాలకు చంద్రగిరిలోని గడియార స్తంభం కూడలిలోని సభకు హాజరవుతారు.

3 గంటలకు నగరి నియోజకవర్గం పుత్తూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలోని సభలో ప్రసంగిస్తారు.

ఈ మూడు సభలు ముగిసిన అనంతరం అక్కడి నుంచి సాయంత్రం 4 గంటల 20 నిమిషాలకు నెల్లూరుకి చేరుకోనున్నారు.

6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నగరంలో రోడ్​షోలో ప్రసంగిస్తారు.

About The Author