ముంబై : మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది…

ముంబై : మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. భార్య వివాహేతర సంబంధంతో కృంగిపోయిన ఓ భర్త తన ఇద్దరి పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తమ్ముడి ఫిర్యాదు మేరకు.. మహారాష్ట్రలోని బల్లాపూర్‌లో నివసించే ఐటీఐ టీచర్‌ రిషికాంత్‌.. తన భార్య స్థానిక డ్రైవర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోవడాన్ని తట్టుకోలేకపోయాడు. తన ఇద్దరు కూతుళ్లు నారాయణి (5), కార్తి(2)లను ఎలా పోషించాలనే వ్యధతో తల్లడిల్లాడు. ముందుగా చున్నీతో బిడ్డలకు ఉరి వేసి, ఆ ఫొటోను వాట్సాప్‌ ద్వారా తన భార్యకు పంపాడు. అనంతరం తానూ ఇంటి పైకప్పునకు ఉరేసుకున్నాడు. ఇంట్లో మూడు మృతదేహాలూ వేలాడుతుండటం మంగళవారం వేకువజామున బల్లార్‌పూర్‌లో తీవ్ర సంచలనం రేకెత్తించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించి దర్యాప్తు ప్రారంభించారు. అర్థ రాత్రి ఒంటి గంట సమయంలో టీచర్‌ ఈ ఘోరానికి పాల్పడి ఉంటాడని పోలీసులు మీడియాకు తెలిపారు.

About The Author