కమలం గూటికి చేరిన రాపోలు ఆనందభాస్కర్…

మాజీ రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్‌ నేత రాపోలు ఆనందభాస్కర్ బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి జేపీ నడ్డా ఆధ్వర్యంలో కమలం గూటికి చేరారు. రాపోలుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికల వేళ తెలంగాణలో కాంగ్రెస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇటీవల డీకే అరుణ, పొంగులేటి సుధాకర్ బీజేపీలో చేరగా.. తాజాగా రాపోలు కూడా అదే గూటికి చేరారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్‌లో చేరుతుండటంతో ఎన్నికల వేళ ఆ పార్టీలో ఇరాకటంలో పడింది.

About The Author