ప్రచారం క్యాన్సల్ లోటస్ పాండ్ లో విలీనం చర్చలు…


బీజేపీ ప్రధాన కార్యదర్శి తో జగన్ భేటీ..
ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని జగన్ అమ్మకానికి పెట్టాడు ..!!

ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో అధికార పార్టీ టీడీపీ ప్రజలతో మమేకమయ్యే పని లో ఉంటే ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ మాత్రం లోటస్ పాండ్ లో ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని అమ్మకానికి పెట్టె పనిలో ఉన్నాడు.. రాష్ట్రానికి ఇస్తామన్న ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్_మాధవ్ తో జగన్ నేడు భేటీ అయ్యారు.. ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయి.. ఎన్నికలయ్యేవరకు పరిస్థితిని ఇలాగే నడిపించి ఆ తర్వాత బీజేపీ తో కుమ్మక్కవ్వాలన్నదే ఈ భేటీ పరమార్థం అని తెలుస్తుంది.. అయితే జగన్ ని కలవడం వెనకాల మోడీ పెద్ద పన్నాగమే పన్నుతున్నాడని తెలుస్తుంది… జగన్ తో కలయిక తో ఆంధ్ర లో అసలే పట్టు లేని బీజేపీ ఎంతో కొంత మద్దతు వైస్సార్సిపి ద్వారా తెచ్చుకుని అటు తెలంగాణ లో జగన్ కి ఉన్న ఫేమ్ తో కొన్ని సీట్లపై కన్నేసింది.. ఇక కర్ణాటక లో కూడా కుమారస్వామి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించి అధికారంలోకి రావాలని చూస్తుంది బీజేపీ. అందుకు జగన్ కూడా అక్కడి బీజేపీ నేత గాలి జనార్దన్ రెడ్డి కి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు.. ఇలా దక్షిణాదిన ఉన్న రాష్ట్రాలలో బీజేపీ తన బలం పెంచుకోవాలని పావులు కదుపుతూ ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేసి వారిని తన బుట్టలో వేసుకుంటుంది.. ఇలా లోపాయకారిగా జగన్ బీజేపీ తో కుమ్మక్కయి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మంటలో కలిపారు.. బీజేపీ ప్రధాన కార్యదర్శి తో భేటీ నే అందుకు ఉదాహరణ కాగా ప్రజల్లో కి వెళ్లి సమయం గడపాల్సిన సమయంలో ఇలా లోటస్ పాండ్ లో కుళ్ళు కుతంత్రాలకు పాల్పడడం జగన్ ఓటమికి తొలిమెట్టు అని చెప్పొచ్చు..

About The Author