యర్రగుంట్ల లో 64 లక్షల 24 వేలు డబ్బులు స్వాధీనం…

64 లక్షల 24 వేలు డబ్బులు స్వాధీనం
యర్రగుంట్ల
64 లక్షల 24 వేలు రూపాయలు ఎటువంటి ఆధారాలు లేకుండా ఉన్న డబ్బులను సీజ్ చేశామని సీఐ బివి రమణ పేర్కొన్నారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక ప్రొద్దుటూరు రోడ్డులో గల వై జంక్షన్ వద్ద తనిఖీల్లో భాగంగా ప్రొద్దుటూరు నుండి తాడిపత్రి కి పోతున్న ఆర్టీసీ బస్సు ను తనికి చేయగా తాడిపత్రికి చెందిన పెద్దిరెడ్డి అనే వ్యక్తి వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులకు ఆధారాలు అడగగా బంగారు అమ్మి తాడిపత్రి కి డబ్బులు తీసుకుని పోతున్నాను అని పెద్దిరెడ్డి తెలుపడని , ఈ డబ్బు కు ఎటువంటి రసీదులు గానీ, ఆధారాలు గాని లేకపోవడంతో ఎన్నికల నియమావళికి విరుద్ధంగా పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుపోవడం తో స్వాధీనపరచుకొని తదుపరి చర్యల నిమిత్తం ఫ్లయింగ్ స్క్వాడ్ కు అప్పగించడం జరిగిందన్నారు.
ఫోటో రైటర్ : స్వాధీనపరచుకున్న డబ్బులతో సిఐ బివి రమణ, పోలీసు సిబ్బంది.

About The Author