కరీంనగర్ జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది…


కరీంనగర్ జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది కరీంనగర్ నుండి ధర్మారం వస్తున్న ఆర్టీసీ బస్సులో ఆర్నాకొండ వద్ద ఈ నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు పోలీసులు బస్సు తనిఖీ చేశారు. బస్సు దిగు వ భాగంలోని లగేజీ క్యాబిన్‌లో మూడు లగేజీ బ్యాగులతో నోట్ల కట్టలు ఉన్నట్లు సీఐ గుర్తించారు. వెంటనే బస్సుతో సహా 23 మంది ప్రయాణికులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
డీఎస్పీ ప పోలీస్‌ స్టేషన్‌కు చేరుకొని బ్యాగులను పరిశీలించారు. రెవెన్యూ అధికారులకు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌కు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. మొత్తం తంతును చిత్రీకరించారు. మూడు లగేజీ బ్యాగుల్లో భారీ మొత్తంలో నగదు ఉన్నట్లు తేలింది. నగదు లెక్కించే యంత్రాలను తీసుకువచ్చి లెక్కించే ఏర్పాట్లు చేశారు. చొప్పదండి పర్యవేక్షించే .trs నేత ఉండటంతో పట్టుబడిన నగదు trs కి చెందినదేనని భావించి పోలీసులు విచారణ చేస్తున్నారు. పట్టుబడిన నగదు సుమారు కోటి రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

About The Author