చంద్రగిరి మండలంలో ప్రేమికుల ఆత్మహత్య


*ఫ్లాష్..ఫ్లాష్…*
– చంద్రగిరిలో దారుణం
– పెద్దలు తమ ప్రేమను అగీకరించరని మొరవపల్లి సమీపంలో రైలు కింద పడి తనువు చాలించిన ప్రేమికులు

చంద్రగిరి…సెల్ఫీ వీడియో

యాంకర్

పిల్లల ప్రేమకు అడ్డుచెప్పకండి…! వారి ప్రేమను అర్థం చేసుకుని ఆశీర్వదించండి….! మా చావు ప్రేమికులను విడదీసేవారందరికి ఉదాహరణ కావాలి…! మమ్మల్ని క్షమించండి ఇదే మా చివరి వీడియో అంటూ ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది.ఆత్మహత్యకు ముందు వారు తీసుకున్న సెల్ఫీ వీడియో సోషియల్ వీడియాలో కలకలం రేపుతోంది.

వాయిస్

చిత్తూరు జిల్లా, చంద్రగిరి మండలం, మొరవపల్లి సమీపంలోని రైల్వే ట్రాక్ పై పడి మంగళవారం ధనంజయ,పల్లవి అనే ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది.పాకాల రైల్వే పోలీసులు, ప్రేమజంట బంధువులు చెప్పిన వారు తీసుకున్న సెల్ఫీ వీడియోలోని వివరాలు ఇలా ఉన్నాయి.శ్రీకాళహస్తికి చెందిన రవిబాబు, సుమతిల కుమార్తె 16 ఏళ్ల పల్లవి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది.శుక్రవారం ఇంటర్ పరీక్ష ఫలితాలు రావడంతో ఇంటర్నెట్ సెంటర్ కు వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళిన పల్లవి కనిపించకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు శ్రీకాళహస్తి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.అలాగే చంద్రగిరి మండలం మొరవపల్లి ఎస్.సి.కాలనీకి చెందిన దొరసామయ్య, పద్మల కుమారుడు 20 ఏళ్ల ధనంజయలు జెసీబి డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.కొంతకాలం క్రితం ధనంజయులకు,పల్లవిలకు ఫేస్ బుక్ ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.వీరిద్దరి కులాలు వేరు కావడం మైనర్లు కావడంతో వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు.దీంతో మూడు రోజుల క్రితం ఇంటి నుంచి పారిపోయి పెళ్ళి చేసుకున్నారు.ఎంతకీ పెద్దలు అంగీకారం తెలపకపోవడంతో మనస్తాపానికి గురైన ధనంజయ, పల్లవి రైల్వేట్రాక్‌పై ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరి మృతదేహాలు తెగిపడి ముక్కలు ముక్కలు కావడంతో ఘటనాస్థలం భయానకంగా మారింది.కాగా ఆత్మహత్యకు ముందు వారు తీసుకున్న వీడియో సోషియల్ మీడియాలో కలకలం రేపుతోంది.

About The Author