రైలు ఢీకొని పెద్దపులి మృతి…


ప్రకాశం, కర్నూలు జిల్లాల సరిహద్దులోని నల్లమల అటవీ ప్రాంతంలో ప్రమాదం జరిగింది. దిగువమెట్ట-చలమ రైల్వే స్టేషన్ల మధ్య మంగళవారం రాత్రి రైలు ఢీకొని పెద్దపులి మృతి చెందింది. పెద్దపులి రైలు పట్టాలు దాటుతున్న సమయంలో వాస్కోడిగామా నుంచి హౌరా వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌ రైలు వేగంగా ఢీ కొట్టింది. రైలు డ్రైవర్‌ నంద్యాల రైల్వేపోలీసులకు సమాచారమిచ్చారు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలికి చేరుకున్నారు.

About The Author