శ్రీవారి సేవలో పాల్గొన్న గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ దంపతులు…

తిరుమల, ఏప్రిల్ 19: శుక్రవారం వేకువజామున శ్రీవారి అభిషేక సేవలో పాల్గొనడానికి తిరుమల శ్రీవారి ఆలయ మహాద్వారం చేరుకున్న గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ వారి సతీమణి శ్రీమతి రూపాంజలి గొగోయ్ లకు ఆలయ మర్యాదలతో టిటిడి ఇ ఓ అనిల్ కుమార్ సింఘాల్, జెఇఓ శ్రీనివాసరాజు, ఆలయ అర్చకులు,ఒఎస్డీ డాలర్ శేషాద్రి స్వాగతం పలికారు. శ్రీవారికి ఆకాశ గంగ జలాలతో శుక్రవారం నిర్వహించే అతిప్రాచీనమైన ఆర్జిత సేవ అయిన అభిషేక సేవలో పాల్గొని, హుండి లో కానుకలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో వేదపండితుల ఆశీర్వచనాలు అందించగా, స్వామివారి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని ఇ ఓ బహుకరించారు. ఆలయఓఎస్డీ లోకనాథం, పేష్కార్ రమేష్ బాబు, తదితరులు ఆలయంలో ఏర్పాట్లను పరిశీలించారు.
*డివిజనల్ పి.ఆర్.ఓ.,తిరుపతి*

About The Author