శ్రీ సిటీ ట్రిపుల్ ఐటీ మొదటి స్నాతకోత్సవం వేడుకలు…

శ్రీ సిటీ ట్రిపుల్ ఐటీ మొదటి స్నాతకోత్సవం లో గౌరవ ఉప రాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్యనాయుడు స్పీచ్ పాయింట్స్.

2015 లో కేంద్ర మంత్రి హోదాలో శ్రీ సిటీ ట్రిపుల్ ఐటీ కి శంకుస్థాపన చేశాను

ఇప్పుడు ఉప రాష్ట్రపతి గా మొదటి స్నాతకోత్సవం కు రావడం ఆనందం గా ఉంది

పీపీపీ మోడల్ లో నిర్మిత మైన ఈ ట్రిపుల్ ఐటీ ద్వారా విద్యార్థులకు చక్కటి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి

100 పరిశ్రమల హబ్ అయిన శ్రీ సిటీ ఆధ్వర్యం లో ఈ ట్రిపుల్ ఐటీ నడవడం గొప్ప విషయం

వచ్చే పది పది హేను ఏళ్లల్లో 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ గా , ప్రపంచంలో 3 వ అతి పెద్ద ఎకానమీ గా భారత్ ఎదగనుంది

దేశ వ్యాప్తంగా 65 శాతం మంది 35 ఏళ్లలో పు వారు కావడం మన బలం

మన దేశ సంస్కృతి ..షేరింగ్ అండ్ కేరింగ్..

హుయత్సాంగ్ లాంటి విదేశీ చరిత్రకారులు మన దేశ గొప్పదనం గురించి వ్రాశారు

ఒకప్పుడు మన దేశమే విద్యారంగంలో మేటి..

నేడు దేశం లో 900 విశ్వ విద్యాలయాలు ఉన్నాయి

కానీ ప్రపంచం లో టాప్ 200 యూనివర్సిటీ ల్లో భారత్ ప్రాతినిధ్యం లేదు

విశ్వ విద్యాలయాల సంఖ్య పెంచడం మంచిదే..కానీ అదే స్థాయిలో విద్యా రంగం లో నాణ్యత పెరగాలి

దేశం లో ఎన్నికల వేళ ప్రజలకు తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చే తాయిలాలు ఇస్తున్నారు..ఇది మంచిది కాదు..ప్రజలకు దీర్ఘకాలిక ప్రయోజనం కలిగేలా హామీలు ఉండాలి.

దేశానికి కావల్సింది తాత్కాలిక హామీలు కాదు

ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడేలా రాజకీయాలు మారాలి

రైతులకు కావల్సింది…12 గంటల నాణ్యత ఉన్న విద్యుత్తు

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 71 ఏళ్ళు గడిచినా నేటికీ 21 శాతం ప్రజలు పేదరికంలో, 22 శాతం నిరక్షరాస్యులు గా ఉన్నారు

ఇలాంటి పరిస్థితులు మారాలి

ప్రజలు స్వయం గా అభివృధి సాధించాలి….
ఆ అవకాశాలను కల్పించేలా పాలకులు చేయాలి

విద్యార్థులు పాశ్చాత్య సంస్కృతిని, జంక్ ఫుడ్ ఆహారపు అలవాట్లను మార్చుకుని ..మన పెద్దలు తినే ఆహారాన్ని తీసుకుని ఆరోగ్యంగా ఉండాలి.

లేటెస్ట్ స్కిల్స్ ..క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా అనలిటిక్స్, ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్, ఫింటెక్ లాంటి స్కిల్స్ నేర్చుకుని మంచి ఉద్యగాలు పొందాలి…
దేశ, సామాజిక.. తలిదండ్రుల సేవ చేయాలి

అనంతరం, ఉపరాష్ట్రపతి గారు తడ రైల్వే స్టేషన్ నుండి ప్రత్యేక రైలు లో చెన్నై వెళ్లారు..చిత్తూరు జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న తదితరులు శ్రీసిటీ వద్ద సాదరంగా వీడ్కోలు పలికారు

About The Author