గొల్లపల్లి లో భార్యను చంపిన భర్త…


కడప జిల్లా రైల్వే కోడూరు

చిట్వేల్ ..చిట్వేల్ మండలంలోని మైలపల్లి పంచాయతీ గొల్లపల్లి హరిజనవాడలో త్రాగుడుకు బానిసైన వ్యకి భార్యను దారుణంగా నరికి చంపాడు. పోలీసుల కథనం మేరకు గొల్లపల్లి హరిజనవాడలో నివసిస్తున్న కాటూరు పెంచలయ్య(45) తన భార్య విజయమ్మ(44)ను రాత్రి నిద్రిస్తున్న సమయంలో మంచంపైనే కొట్టి చంపాడు. వీరికి ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. పెంచలయ్య తన సంపాదనను ఇంటిలో ఇవ్వకుండా త్రాగుడుకు వాడుకునే వాడని,భార్య సంపాదించిన డబ్బులు తోనే ముగ్గురు ఆడపిల్లలకు పెండ్లి చేసిందని,కుమారుడు హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నాడని, త్రాగుడుకు డబ్బులు ఇవ్వలేదని బుధవారం రాత్రి విజయమ్మ నిద్రిస్తున్న సమయంలో హత్య చేసాడని పోలీసులు తెలిపారు. మృతురాలు కుమార్తె భాగ్యమ్మ ఇచ్చిన సమాచారం అందుకున్న కోడూరు సి.ఐ. బాలయ్య, చిట్వేల్ పోలీసులతో కలిసి సంఘటన స్థలానికి చేరుకొని ముద్దాయిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.శవాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.కోడూరు ఎస్.ఐ. రమేష్ బాబు,ఎస్.బి.హెడ్ కానిస్టేబుల్ శంకర్ రాజు చిట్వేల్ పోలీసు స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ భాస్కర్ రెడ్డి, కానిస్టేబుల్ విజయకుమార్, మహేష్ తదితరులు సంఘటన స్థలానికి వెళ్లారు.

About The Author