నేడు హిమాచల్‌ప్రదేశ్‌కు చంద్రబాబు…

ఏపీ సీఎం చంద్రబాబు నేడు హిమాచల్‌ప్రదేశ్‌కు కుటుంబంతో కలిసి వెళ్లనున్నారు. ఎన్నికలు సమయమంతా బిజీబిజీగా గడిపిన చంద్రబాబు అనంతరం కూడా ఈవీఎంలపై పోరు నిర్వహిస్తూ క్షణం తీరిక లేకుండా గడిపారు.

దీంతో ఆయన కాస్త విశ్రాంతి తీసుకునేందుకు హిమాచల్ ప్రదేశ్ వెళుతున్నారు. వేసవి విడిది కోసం కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి.. మూడు రోజులపాటు హిమాచల్‌ప్రదేశ్‌లో పర్యటించనున్నారు.

About The Author