బావా మరుదుల అరెస్టుకు తమిళనాడు హైకోర్టు ఆదేశాలు…

ప్రముఖ చలన చిత్ర నటులు శరత్‌ కుమార్‌, రాధారవి అరెస్ట్‌కు మద్రాస్‌ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తమిళనట సినీనటుల సంఘమైన నడిగర్ సంఘానికి శరత్‌కుమార్‌ అధ్యక్షునిగా.. రాధారవి కార్యదర్శిగా పనిచేసిన సమయంలో… కాంచీపురం జిల్లా వెంకటమంగళంలో ఉన్న నడిగర్ సంఘానికి చెందిన స్థలాన్ని అక్రమంగా విక్రయించారని 2017లో దాఖలైన పిటిషన్ ను విచారించిన మద్రాస్ హైకోర్టు.. 3 నెలల్లో సదరు స్థల విక్రయం కేసును తేల్చాల్సిందిగా గడువు విధిస్తూ… అవసరమైతే.. శరత్‌కుమార్‌, రాధా రవిలను అరెస్ట్‌ చేసైనా విచారణ చేయాల్సిందిగా కాంచీపురం క్రైం బ్రాంచ్ ను ఆదేశిస్తూ… ఉత్తర్వులు జారీచేసింది మద్రాస్ హైకోర్టు.

ప్రస్తుతం నడిగర్‌ సంఘానికి హీరో విశాల్‌ సెక్రటరీగా ఉన్నాడు. తప్పుడు పత్రాలు సృష్టించి సంస్థకు చెందిన ఆస్తిని అక్రమంగా విక్రయించారని విశాల్‌ కూడా ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.

శరత్ కుమార్, ప్రముఖ నటి రాధిక భర్త కాగా, రాధా రవి స్వయానా సోదరుడు… సో ఈ బావా మరదులకు భవిష్యత్తులో కష్టాలు తప్పేలా లేవు…

About The Author