ఆంధ్రప్రదేశ్ లో మొదలైన రీ-పోలింగ్…

గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలోని ఐదు పోలింగ్ కేంద్రాలలో ఉదయం 7గంటలకే మొదలైన రీ-పోలింగ్… గత రెండు రోజులుగా తీవ్రమవుతున్న ఎండల దృష్ట్యా ఉదయాన్నే బారులు తీరిన ప్రజలు… వెబ్ కాస్టింగ్ ద్వారా, కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షిస్తున్న అధికారులు…

గుంటూరు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కేసానుపల్లి, 94వ బూత్‌, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నల్లచెరువులోని 244వ బూత్‌, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పల్లెపాలెం గ్రామం ఇసుకపల్లి 41వ బూత్ లో అదేవిధంగా నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని అటకానితిప్ప 197వ పోలింగ్ బూత్‌, యర్రగొండపాలెం నియోజకవర్గంలోని కలనూతలలో 247వ పోలింగ్‌ కేంద్రాలలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది…

About The Author