బాసర సరస్వతీ అమ్మవారి కిరీటంలోని వజ్రం మాయం…


నిర్మల్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారి కిరీటంలోని వజ్రం మాయమైంది. ఈ విషయం సోమవారం వెలుగులోకి వచ్చింది. గత కొన్ని రోజులుగా అమ్మవారి కిరీటం పైనున్న వజ్రం కనిపించకుండా పోయినప్పటికీ ఆలయ అధికారులు, అర్చకులు విషయాన్ని గోప్యంగా ఉంచడం పై భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అమ్మవారికి పూజ చేసే క్రమంలో వజ్రం రాలి పోయి ఉంటుంది అని ఆలయ అధికారులు, అర్చకులు అంటున్నారు. కాగా గతంలో రాజగోపురాలకు మరమ్మత్తులో భాగంగా వాటిపై పెట్టే కలశాలు మాయమయ్యాయి. రెండు రాజగోపురాలపై ఉండాల్సిన కలశాలను కోతులు ఎత్తుకెళ్లాయని అధికారులు చెప్పగా కోతులు ఎత్తుకెళ్లడమేంటని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం విదితమే. ఇలా వరుస అదృశ్యాల పట్ల అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పట్ల పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

About The Author