అమెరికా లో నలుగురు తెలుగు వారి మృతి.. తుపాకీ తో కాల్చి చంపేశారు..


అమెరికాలోని అయోవా రాష్ట్రం వెస్ట్‌డెస్‌ మొయినిస్‌లో నలుగురు తెలుగువాళ్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. సుంకర చంద్రశేఖర్‌ (44), సుంకర లావణ్య (41)తో పాటు 10, 15 ఏళ్ల వయస్సున్న మరో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. పక్కింట్లో ఉన్న వ్యక్తి అందించిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలిని పరిశీలించారు. తుపాకీతో కాల్చడం వల్ల వీరు మరణించారని పోలీసులు తెలిపారు. వారిని ఎవరైనా హత్య చేశారా?చంద్రశేఖరే ముగ్గురినీ కాల్చి చంపి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడా? అన్నది తెలియరాలేదు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అన్నికోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు అక్కడి పోలీసులు తెలిపారు.

About The Author