గర్భిణీ స్త్రీ పాటించవలసిన ఆహారనియమాలు –


* గర్భిణిస్త్రీ ప్రసవం అయ్యేంతవరకు హృదయానికి ఇంపుగా , బలకరంగా ఉండి ద్రవంగా ఉన్న ఆహారాన్ని తినవలెను .
* అన్ని రసాలలో మధురరసం మంచిది . ఆహరం చమురుతో కూడుకుని ఉండవలెను . ఎండిపోయినట్లు ఉండరాదు.
* ఆకలి మందగించకుండా ఆగ్నిదీప్తి కలిగించే ఆహారాలు తప్పకుండా తీసుకోవలెను . ప్రసవం అయ్యేవరకు ఇదే పద్దతి పాటించవలెను .
* రెండు , మూడు మాసాలలో తియ్యగా ఉండి ద్రవంగా ఉన్న ఆహారాన్ని ఎక్కువుగా భుజించాలి . మూడోమాసంలో షష్ఠిక బియ్యముతో తయారైన అన్నమును పాలతో కలిపి ఎక్కువుగా తినవలెను .
* నాలుగోవ మాసము నందు షష్టిక బియ్యపు అన్నమును పెరుగుతో ఎక్కువ తీసుకొవలెను . ఐదో మాసములో మరలా పాలతో కలిపి ఎక్కువ తినవలెను . ఆరోవ మాసము నందు ఈ బియ్యపు అన్నమును నెయ్యితో కలిపి తీసికొనవలెను.
పైన చెప్పిన శాస్త్రప్రవచనంలో ఆహారపు మూలద్రవ్యాలన్నీ ఉన్నాయి . వాటిలో ఒక్కొక దాన్ని ఒక్కో మాసములో ప్రధానం చేసి విధించింది. మధురద్రవ్యాలను , పిష్టద్రవ్యాలను , మాంసకృత్తులను క్రమంగా కలిపి చెబుతూ అయా మాసాలలో లోపం రాకుండా పూర్తిచేయాలని శాస్త్రం యొక్క అభిప్రాయం .

గర్భిణి స్త్రీకి ఎక్కువుగా రక్తలోపం రావటం , తెల్లబారి ఉండటం జరుగుతుంది. ఇందుకు ప్రధాన కారణం తల్లి రక్తంలో ఉన్న ఐరన్ లోహాన్ని తన పోషణార్ధం గర్భస్థ శిశువు తీసుకుంటుంది. అందువలన తల్లి తెల్లబడిపోతుంది. ఈ కారణం వలన ఐరన్ అధికంగా ఉన్న ఆహారపదార్ధాలను గర్భవతికి ఇవ్వవలెను. మాంసం , కోడిగుడ్డు , లివరు , తోటకూర , బీరకాయ ఇవ్వవలెను . వీటిలో ఐరన్ ఎక్కువుగా ఉండును.

గర్భిణి స్త్రీ రక్తంలో అయోడిన్ అనే ద్రవ్యం సమప్రమాణంలో ఉండవలెను . ఇది తల్లి మరియు గర్భస్త శిశువుకు చాలా అవసరం . దీని లోపం వలన శరీరవికృతి , బుద్ధిమాంద్యం , గండమాల , మిక్సీడోమా వంటి వ్యాధులు సంభవించును . సరైన జాగ్రత్తలు తల్లి తీసుకోకుంటే ఆ స్త్రీకి ఎంతమంది సంతానం కలిగితే అంతమంది లోపముతోనే జనిస్తారు. ఈ లోపము రాకుండా సముద్రపు చేపలు , కాడ్లివరు ఆయిల్ ఇవ్వడం మంచిది .

గర్భవతి ఏ ఆహారాన్ని అయినా అతిగా తీసుకోకూడదు . అన్నిరకాల రసాలను సమానంగా తీసుకోవలెను . ఏదన్నా ఒకేరకమైన రసాన్ని ఎక్కువుగా తీసుకొనుచున్న కలిగే దుష్ప్రభావాలను ఆయుర్వేదంలో చక్కగా వివరించటం జరిగింది.

గర్భవతి ప్రతిదినం తీపివస్తువులను అధికంగా తినుచున్న ప్రమేహరోగి , మూగవాడు , స్థూలకాయుడు పుడతాడు. పులుసు అధికంగా తింటే రక్తపిత్తరోగం కలవాడు , చర్మరోగం , నేత్రరోగం కలవాడు పుడతాడు . ఉప్పు అధికంగా తినుచున్న చిన్నవయస్సులోనే శరీరం ముడతలు పడి తలనెరిసినవాడు , బట్టతలవాడు పుడతాడు. చేదు పదార్ధాలు అతిగా తీసుకొనుచున్న క్షయరోగం కలవాడు , బలహీనుడు , పొట్టివాడు లేక శరీరవికృతి కలిగినవాడు పుడతాడు . కారం అధికంగా భుజిస్తే దుర్బలుడు , అల్పశుక్రం కలిగినవాడు , సంతానహీనుడు పుట్టును . వగరు అతిగా తీసుకొనుచున్న నల్లవాడు , ఆనాహారోగం , కడుపు సంబంధ సమస్యలు కలిగినవాడు జన్మించును . మత్స్య మాంస పదార్దాలు ఎక్కువుగా తీసుకొనుచున్న రెప్ప ఆలస్యముగా వేయువాడు లేదా అసలు రెప్పలు వేయనివాడు జన్మించును . మద్యం అధికంగా తీసుకొనుచున్న దప్పికరోగం కలవాడు , స్మరణశక్తి లేనివాడు , చంచల స్వభావం కలవాడు పుట్టును . చాలామంది గర్భిణి స్త్రీ ఆహారం తక్కువ మోతాదులో తీసుకోవాలి అని చెబుతుంటారు. ఇది చాలాపొరపాటు . దీనివలన తక్షణమే చాలారోగాలు జనియించును . తీసుకునే ఆహారం తక్కువ ఉన్నను మూలద్రవ్యాలు అన్ని ఆహరంలో ఉండవలెను . తిన్నదంతా సుఖంగా జీర్ణం కావలెను . గర్భం యొక్క ప్రారంభకాలంలో మరియు వాంతులతో అధికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు తైల సంబంధ ఆహారపదార్ధాలు పనికిరావు. అందుకే ఆరోమాసం వరకు నెయ్యి గురించి ఆయుర్వేదం చెప్పలేదు . అప్పటికి వాంతిదోషం తగ్గును. వాంతుల సమస్య ఉన్నవారు నెయ్యి , వెన్న తీసుకోకూడదు .

గర్భిణి స్త్రీ కోరిన పదార్ధం ఇవ్వమని ఆయుర్వేదం చెప్తుంది . అది దోష సంబంధ పదార్థం అయితే మాత్రం ఇవ్వరాదు. గర్భిణి స్త్రీలలో చాలామంది మలబద్దకంతో బాధపడుతుంటారు. దీనివలన కొంతమందికి మొలల సమస్య కూడా వచ్చును. ఈ మలబద్దకం రావడానికి ప్రధానకారణం పేగులపైన గర్భం యొక్క ఒత్తిడి పడటమే ఇలాంటి స్థితిలో ద్రవ ఆహారాన్ని ఎక్కువుగా తీసికొనవలెను. ద్రవం ఎక్కువ కలిగిన ఫలాలను తీసుకోవడం మంచిది . బాగా పండిన అరటిపండు కూడా మలబద్ధకమును పోగొట్టును . పొట్లకాయ , బీరకాయ , వంకాయ , తొటకూర , దొగ్గలికూర , పొన్నగంటికూర , క్యాబేజి , కాలిఫ్లవర్ వంటివి మలబంధనాన్ని తొలగించును . గర్భిణి స్త్రీకి విరేచన ఔషదాలు ఇవ్వకూడదు.

గమనిక –

నేను రాసిన ” ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు ” మరియు ” ఆయుర్వేద మూలికా రహస్యాలు ” రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును. ఈ గ్రంథాలలో మొక్కలను సులభముగ గుర్తించుటకు మొక్కల చిత్రాలు రంగులలో ఇవ్వడం జరిగింది.

ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది .వెల – 350 రూపాయలు .
ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది. వెల – 450 రూపాయలు కొరియర్ చార్జీలు కలుపుకొని

మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .
కాళహస్తి వేంకటేశ్వరరావు .
అనువంశిక ఆయుర్వేద వైద్యులు .
9885030034

About The Author