మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు రోడ్డు ప్రమాదంలో మృతి


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పనిచేసిన బలిరెడ్డి సత్యారావు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఈ రోజు విశాఖ బీచ్‌రోడ్డులో వాకింగ్‌ చేస్తుండగా ఓ వాహనం ఆయనను ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన సత్యారావును సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆయన చికిత్స పొందుతూ చనిపోయారు. సత్యారావు రెండు పర్యారాలు ఎమ్మెల్యేగా పనిచేశారు. 1989, 1999లో తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నుంచి గెలుపొందారు. తర్వాత ఆయన వైకాపా పార్టీలో చేరారు.

About The Author