భర్తపై తప్పుడు వేధింపుల కేసు…


మాజీ భర్తపై తప్పుడు వేధింపుల కేసు పెట్టినందుకు అతనికి 25వేల రూపాయలు చెల్లించాలని కర్నాటక హైకోర్టు ఓ మహిళ కేసులో తీర్పు చెప్పింది. 35 ఏళ్ళ నజియా ఆస్మా అనే మహిళ కువైట్ లో ఇంజనీర్ గా పనిచేస్తోన్న ఫైసల్ అహ్మద్ ఖాన్ ను పెళ్ళి చేసుకుంది. భర్తతో కువైట్ కి వెళ్ళేందుకు నిరాకరించడంతో అతను ఉద్యోగానికి రాజీనామా చేసి బెంగుళూరుకు వచ్చేశాడు. 2011లో ఆమె ఇంటి నుంచి వెళ్ళిపోయింది. 2012లో ఫైసల్ అహ్మాద్ ఖాన్ మళ్ళీ కువైట్ లో ఉద్యోగానికి వెళ్ళాడు. అయితే నజియా మాత్రం తన భర్త అదనపు కట్నం కోసం తనను హింసిస్తున్నాడని కేసు పెట్టింది. హైకోర్టు ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించి, ఇది తప్పుడు కేసు అని తీర్పు చెప్పి 25వేలు జరిమానా విధించింది. నజియాకు ఇది రెండో పెళ్ళి. మొదటి భర్తకు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్ళి చేసుకుంది. ఆ తర్వాత ఫైసల్ కు విడాకులు ఇవ్వకుండానే మూడో పెళ్ళి చేసుకుంది. కోర్టు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి, ఆమెపై క్రిమినల్ కేసు కూడా నమోదు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.

About The Author