తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో అన్న ప్రసాదం పంపిణీ…


TTD Food Packets

తిరుపతి ఎంఎల్ఏ కరుణాకర రెడ్డి గారు,కొరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో తిరుపతిలోని నిరు పేదలకు, పని లేని దినసరి కూలీలకు టీటీడీ అన్నదానంలో వున్న సరుకులతో భోజన పొట్లాలు పంపిణీ చేయవలసిందిగా ప్రజల కోరిక మేరకు టీటీడీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. వెనువెంటనే స్పందించిన టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ గారు మరియూ టీటీడీ అడిషనల్ ఈఓ ధర్మా రెడ్డి గారు ఈ రోజు అనగా 28-3-2020 ఇరవై వేల భోజన పొట్లాలు తాయారు చేయించారు. ఇక నుంచి ప్రతి పూటా 50 వేల భోజన పొట్లాల పంపిణీకి టీటీడీ అధికార యంత్రంగాన్ని సిద్ధం చేసారు.

About The Author