పోలీసులనే బెదిరించిన వ్యక్తి..అసలు ట్విస్ట్ ఏంటంటే!


కరోనా కట్టడి కోసం ప్రభుత్వం లాక్ డౌన్ విధించి ప్రజలందరినీ ఇళ్లలో ఉండాల్సిందిగా హెచ్చరికలు జారీ చేయగా.. కొంత మంది పదే పదే రోడ్లపైకి వస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించిన పోలీసులపై కొందరు తిరగబడుతున్నారు. తాజాగా హైదరాబాద్లోని లంగర్హౌస్లో ఓ వాహనదారుడు తనను అడ్డగించిన పోలీసులపై తిరగబడటమే కాకుండా బూతు పురాణం అందుకున్నాడు. నన్ను మీరు ఏంచేయలేరు అంటూ సవాల్ విసరడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోని విచారించగా ..కి షాకింగ్ విషయం తెలిసింది.ఆ షాకింగ్ విషయాలు ఏవి అంటే .. లాక్ డౌన్ విధుల్లో భాగంగా లంగర్ హౌస్ పరిధిలోని టిప్పు ఖాన్ బ్రిడ్జి వద్ద పోలీసులు వాహనాలను ఆపి తనిఖీలు చేస్తున్నారు. ఇంతలో ఓ వ్యక్తి హెల్మెట్ మాస్కు లాంటివి ఏమీ లేకుండా తన బైక్ పై దర్జాగా అక్కడికి వచ్చాడు. అతణ్ని చూడగానే పోలీసులు అడ్డగించారు. ఆపకుండా వెళ్లే ప్రయత్నం చేయడంతో అడ్డగించి బైక్ తాళం లాగేసుకున్నారు. దీంతో అతడు ఒక్కసారిగా పోలీసులపై బూతు పురాణం అందుకున్నాడు. ఎవడనుకున్నరు.. బాంబ్ పెట్టి లేపేస్తా పోలీస్ స్టేషన్ మొత్తాన్ని లేపేస్తా.. నా తడాఖా ఏందో చూపించనా.. ఎస్పీని పిలుస్తవా డీఎస్పీని పిలుస్తవా పిలువు.. నా బండి నేను ఇన్నే ఉంటం.. వీడియో తీసుకోండి.. నా మాటలు కూడా తీసుకోండి.. లాక్డౌన్ లాక్డౌన్ అనుకుంట పబ్లిక్ను ఎన్ని రోజులు పరేషాన్ చేస్తరూ’ అంటూ పోలీసులనే ప్రశ్నించాడు.మధ్యలో కొంత మంది వాహనదారులు వచ్చి నచ్చజెప్పడానికి ప్రయత్నించగా.. వారిపైనా తిరగబడ్డాడు. అతడి చేష్టలకు విసిగిపోయిన పోలీసులు అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడి గురించి ఆరా తీయగా.. రెండు నెలల కిందట ఎర్రగడ్డ మానసిక వైద్యశాల నుంచి డిశ్చార్జ్ అయినట్లు తెలిసింది. సంవత్సరం కిందట భార్య చనిపోవడంతో పిచ్చిగా ప్రవర్తిస్తున్నట్లు తేలింది. అతడికి మతిస్థిమితం సరిగా లేదని తెలియడంతో పోలీసులు మరోసారి షాక్ తిన్నారు. చనిపోయిన భార్య గుర్తుకొచ్చి రెండు రోజులుగా పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడని లంగర్హౌస్ పోలీసులు తెలిపారు. అతడిని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది

About The Author