గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం కాశిపాడులో దారుణ హత్య..


గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం కాశిపాడులో దారుణ హత్య..జరిగింది.

చిల్లర కొట్టు నడుపుతున్న వృద్ద దంపతులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి… చేసారు.

ఈ దాడి లో పులిపాటి రాధాకృష్ణమూర్తి, అక్కడికక్కడే మృతి చెందారు. భార్య వెంకట నరసమ్మ. కు తీవ్ర గాయాలయ్యాయి.

ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు చోరీ…చేసి పరారయ్యారు.

భార్య వెంకట నరసమ్మకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరు ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు…

గతంలో ఇదేతరహలో క్రోసూరు మండలం గుడిపాడు,రాజుపాలెం మండలం కొండమోడు లో జంట హత్యలు…జరిగాయి.

పోలీసులకు సవాల్‌గా మారిన జంటహత్యకేసులు ఒంటరిగా వుంటున్న వృద్ధ దంపతులే టార్గెట్‌గా చేసి హత్యలకు పాల్పడుతున్నారు.

About The Author