హైదరాబాద్ లో కొత్త నిషేధాజ్ఞలు…. నేటినుంచి 2 నెలల పాటు


హైదరాబాద్: కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ నాలుగో దశ కొనసాగుతున్న వేళ తెలంగాణ ప్రభుత్వం సడలింపులు ప్రకటిస్తూనే కొన్ని నిషేధాజ్ఞలు కూడా జారీ చేస్తోంది. హైదరాబాద్ సెక్రటేరియట్ చుట్టూ 3 కిలోమీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు విధిస్తూ హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ప్రకటన జారీ చేశారు. సెక్రటేరియట్ చుట్టూ 3 కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి సభలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ఐదుగురు లేదా అంతకన్నా ఎక్కువ మంది గుమిగూడరాదని చెప్పారు. అనుమతి లేకుండా ధర్నాలు చేయరాదని తెలిపారు. నేటి నుంచి రెండు నెలల పాటు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని అంజనీకుమార్ తెలిపారు. ఆదేశాలు ధిక్కరించిన వారిపై సెక్షన్ 188 ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

About The Author