జూన్‌ 30 వరకూ లాక్‌డౌన్‌ పొడిగింపు…


దేశంలో నానాటికీ కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా జూన్‌ 30 వరకూ లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే, లాక్‌డౌన్‌ 5.0లో కొన్ని సడలింపులు ఇచ్చింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది.
జూన్‌ 8 నుంచి దేవాలయాలు, ప్రార్థనామందిరాలకు అనుమతి.
* జూన్ 8 నుంచి  హోటళ్లు, రెస్టారెంట్లు, వసతి సేవలు, షాపింగ్‌ మాల్స్‌కు అనుమతి. 
* కర్ఫ్యూ సమయం మరింత సడలింపు. రాత్రి 9గంటల నుంచి ఉదయం 5గంటల వరకూ
పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకే నిర్ణయాధికారం
* విద్యాసంస్థలు పునఃప్రారంభంపై జులైలో నిర్ణయం
* విద్యాసంస్థల పునఃప్రారంభం విషయంలో కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు ఇస్తుంది.
లాక్‌డౌన్‌ 5.0 వీటికి అనుమతి లేదు.
* మెట్రో రైలు సేవలకు ఇంకా అనుమతివ్వని కేంద్రం
* అంతర్జాతీయ విమాన సేవలకు అనుమతి లేదు
* సినిమాహాల్స్‌, జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్స్‌, పార్కులు, బార్లకు అనుమతివ్వని కేంద్రం
* రాజకీయ, సామాజిక, క్రీడా కార్యక్రమాలపై ప్రస్తుతానికి అనుమతి లేదు

About The Author