ఏపీ : ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా..!

ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది. ఈ నెల 8న రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఇళ్ల పట్టాలను పంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సంధర్బంగా పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలనుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతుండటంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నామని అధికారులు తెలిపారు. కాగా ఈ కార్యక్రమాన్ని తిరిగి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

About The Author