మధ్యప్రదేశ్ గవర్నర్ కన్నుమూత


మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్(85) తీవ్ర అనారోగ్యంతో గత కొంత కాలంగా చికిత్స తీసుకొంఉన్నారు, వెంటిలేటర్ పై ఉన్న టాండన్ పరిస్థితి మరింత క్షీణించడంతో కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారని, ఆయన కుమారుడయ అశుతోష్ టాండన్ పేర్కొన్నారు. 2019 జూలై 20న మధ్యప్రదేశ్ గవర్నర్ గా తొలిసారి బాధ్యతలు చేపట్టిన లాల్జీ టాండన్, సరిగ్గా నిన్నటితో గవర్నర్ గా ఏడాది పూర్తి చేసుకొన్నారు.

ఉత్తర్ ప్రదేశ్ శాసన మండలికి అనేక పర్యాయాలు ప్రాతినిధ్యం వహించిన లాల్జీ టాండన్ మాయావతి, కళ్యాణ్ సింగ్ ప్రభుత్వాలలో మంత్రిగా పనిచేసారు. 2009 లో లక్నో పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్యం వహించారు

About The Author