ప్రియురాలిపై కత్తి తో దాడి

కుప్పం మండలం అడవి బుదుగుర్ లో దారుణం,ప్రియురాలు ఆపిల్ ను అతికిరాతకంగా గొంతుకోసి ప్రియుడు ఆనంద్ హత్యయత్నం ,ఆమె కేకలు పెట్టడంతో చుట్టుపక్కల వారు, అంబులెన్స్ సహాయంతో ఆస్పత్రికి తరలింపు ,ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆపిల్, కేసు నమోదు చేసి దర్యాప్తు,నిందితుడు ఆనంద్ ను అరెస్ట్ చేసి రేమండ్ కు తరలింపు

వివరాల్లోకి వెళ్తే…. 

తిరుపతి,2020 జూలై 28,కుప్పం మండలం అడవి బుదుగుర్ లో దారుణం  చోటు చేసుకుంది. ప్రియుడు ఆనంద్, ప్రియురాలు ఆపిల్ మద్య అర్దరాత్రి 12 గంటల సమయంలో వివాదం. ఈ వివాదం లో తన ప్రియురాలు మరో వ్యక్తి తో అక్రమ సంబంధం పెట్టుకుందని ఆపిల్ అనే తన ప్రియురాలిపై కత్తి తో దాడి చేయడం జరిగింది. ఇంటి పక్కన వాళ్ళు గమనించి తీవ్రం గా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించారు . పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా నిందితుడు తన ప్రియుడి అని తేలగా అరెస్ట్ చేసి రేమండ్ కు తరలించారు.  మరిన్ని వివరాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది.

About The Author