శ్రీవారిని దర్శించుకున్న రష్యన్‌ మహిళ ఎస్తర్

తిరుపతి: 2020 జూలై 30:ఆధ్యాత్మిక యాత్రకు వచ్చి, ఇక్కడే ఇరుక్కుపోయిన రష్యా యువతి ఎస్తర్‌ గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 

పత్రికల్లో వచ్చిన కథనాలకు స్పందించిన తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి… తన ప్రతినిధులను ఎస్తర్‌ వద్దకు పంపించారు. 

ఇవాళ శ్రీవారిని దర్శించుకునే అవకాశం కల్పించారు. 

సినీ నటుడు సోనూ సూద్‌ కూడా స్పందించారు. 

తనవంతుగా ఎలాంటి సాయమైనా చేస్తామంటూ హామీ ఇచ్చారు. 

ఓ న్యాయవాది కుటుంబం ఆదరించి ఎస్తర్‌కు వారింట్లోనే బస, భోజన వసతి కల్పించింది. రష్యాకు చెందిన తల్లీకూతుళ్లు ఒలివియా(55), ఎస్తర్‌(32)లకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమార్తె, స్వర్ణభారతి ట్రస్టు ఛైర్మన్‌ దీపా వెంకట్‌ అండగా నిలిచారు. తల్లీకూతుళ్లతో ఆమె మాట్లాడారు. రష్యన్‌-తెలుగు, రష్యన్‌-హిందీ మాట్లాడే దుబాసీలను వారి వద్దకు పంపుతున్నారు. బృందావనంలో చిక్కుకున్న ఒలివియాను తిరుపతికి తీసుకొచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లుచేశారు.

About The Author