మహమ్మారిన కరోనా జయించారు.. ఆర్ధిక సమస్యల ముందు ఓడిపోయారు..


ధర్మవరం ;

-ఆర్ధిక సమస్యలతో భార్యాభర్తలు ఆత్మహత్య

– మహమ్మారి కరోనాను జయించిన దంపతులు.. ఆర్థిక సమస్యలను అధిగమించలేక బలవన్మరణం పొందారు. వివరాలలోకి వెళితే ధర్మవరం పట్టణంలోని తేరు బజారులో ఫణిరాజ్, శిరీష దంపతులు మేడ పై నుంచి దూకి శనివారం అర్థరాత్రి ఆత్మహత్య చేసుకున్నారు.

-కరోనాను జయించారు :

ఇటీవలే ఫణిరాజ్ తల్లి వరలక్ష్మి కరోనా బారినపడి పది రోజుల క్రితం మృతి చెందింది. దీంతో ఫణి రాజ్, శిరీష దంపతులు కూడా కరోనా బారిన పడ్డారు. వీరిద్దరూ కొన్ని రోజుల పాటు కోవిడ్ కేర్ సెంటర్ లో చికిత్స తీసుకుని, రెండు రోజుల క్రితం డిశ్చార్జ్ అయ్యారు. బెల్లం వ్యాపారం నిర్వహిస్తున్న ఫణి రాజ్ గత కొంతకాలంగా వ్యాపారాలు సరిగా జరగక పోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అని తెలిసింది. ఈ క్రమంలో తండి అనారోగ్యానికి గురి కావడం, వ్యాపారం లేకపోవడం పైగా నుంచి రుణదాతల నుంచి ఒత్తిడి అధికం కావడంతో.. చేసేది లేక భార్యభర్తలిద్దరు ఇంటి పై అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నారని తెలిసింది. కాగా మృతి చెందిన దంపతులకు ఒక కుమారుడు ఉన్నట్లు తెలిసింది.

About The Author